దిశ కేసులో కీలక మలుపు

దిశ కేసులో కీలక మలుపు

disa

దిశ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. కేసు విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్‌ కోర్టు ఏర్పాటు అయ్యింది.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబర్‌నగర్‌లో ఈ ఫాస్ట్‌ ట్రాక్‌కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మహబూబ్‌నగర్‌లోని 1వ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌‌, సెషన్స్‌ జడ్జికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు విధివిధానాలు నిర్ణయించిన తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్‌కు సూచించింది..

షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన దిశ హత్యాచారం కేసు యావత్‌ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో నిందితులపై సత్వరమే విచారణ జరిపి..వెంటనే ఉరితీయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను వేగవంతంగా కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటుతో విచారణను వేగంగా పూర్తిచేసి.. ఈ కేసులో దోషులను తేల్చి.. కఠినశిక్ష విధించాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. దీనిపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story