మోగిన పురపాలక నగారా
By - TV5 Telugu |23 Dec 2019 4:41 PM GMT
తెలంగాణలో పురపాలక ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 22న పోలింగ్ జరగనుండగా.. 25న ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ మేరకు జనవరి 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు తీసుకుంటారు. జనవరి 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లపై ఆ తర్వాతి రెండు రోజులు అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. జనవరి 14న నామినేషన్ల ఉపసంహరణకు గడువిస్తారు. 22న పోలింగ్ నిర్వహించి.. 25న ఫలితాలు ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com