సమత కేసులో ఛార్జ్‌షీటు దాఖలు

సమత కేసులో ఛార్జ్‌షీటు దాఖలు

samatha

కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సమత హత్య కేసులో పోలీసులు శనివారం ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణకు ఆదిలాబాద్‌ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధ కోర్టును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుగా ఏర్పాటు చేశారు. ఆ కోర్టు న్యాయమూర్తి ఎం.జి. ప్రియదర్శినికి ఆసిఫాబాద్‌ ఎస్పీ మల్లా రెడ్డి ఛార్జ్‌షీట్‌ అందజేశారు.

నిందితులపై 302, 376డి సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద మరికొన్ని అభియోగాలు మోపినట్టు ఎస్పీ మల్లా రెడ్డి తెలిపారు. ఈ కేసులో 44 మంది సాక్షులను విచారించామన్నారు.

ఈ కేసులో నమోదైన అభియోగ పత్రాల మేరకు కేసును విచారించనున్నట్టు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రమణా రెడ్డి తెలిపారు. నిందితుల తరపున న్యాయ వాదులు ముందుకు రాని పక్షంలో న్యాయ సేవా సంస్థ నుంచి న్యాయవాధిని నియమించే అవకాశం ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story