అందుకే.. ఇక నేను తప్పుకుంటా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
By - TV5 Telugu |31 Dec 2019 4:02 PM GMT
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. హుజూర్నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్. పీసీసీ బాధ్యతలతో సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించలేకపోతున్నాని.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పీసీసీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత హుజూర్నగర్, కోదాడ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com