ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మహిళ ఆత్మహత్యాయత్నం
By - TV5 Telugu |17 Dec 2019 8:25 AM GMT
నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల శానిటేషన్ విభాగంలో సూపర్ వైజర్గా పనిచేస్తున్న మాలతి ఆత్మహత్యకు యత్నించారు. హాస్పిటల్లోనే మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అప్పటికప్పుడు ఆమెకు చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది.
పదినెలలుగా కాంట్రాక్టర్ జీతాలు చెల్లించడంలేదని మాలతి ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆమె జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఆమెను ఉద్యోగంలోంచి తీసేశాడు. తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని కలెక్టర్ చెప్పినా కాంట్రాక్టర్ వినలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురైన మాలతి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం ఆమెకు అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్ సూపరిండెంట్, అధికారులు మాలతిని పరామర్శించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com