పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీలక్ష్మీ ఆరోగ్య పరిస్థితి విషమం

పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీలక్ష్మీ ఆరోగ్య పరిస్థితి విషమం

srilakshmi

అమరావతిలో పోలీసుల దౌర్జన్యకాండ మితిమీరిపోతోందని రాజధాని ప్రాంత జనాలు మండిపడుతున్నారు. మూడ్రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో బీతిల్లిపోతున్నారు. ఇప్పటికే పొలాలు, ఆస్తులు పొగొట్టుకున్నాం. ఇక ఇప్పుడు ప్రాణాలు పొయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఎర్రమనేని శ్రీలక్ష్మీపై జరిగిన దాడితో మందడం జనం మండిపడుతున్నారు.

మహిళలు అన్న జాలి లేకుండా దాడులు చేశారు. పోలీసుల దాడిలో కుప్పకూలిపోయిన ఎర్రమనేని శ్రీలక్ష్మి అనే పాతికేళ్ల మహిళ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. శనివారం పోలీసుల దాడిలో కడుపు నొప్పితో తల్లడిల్లిపోయిన శ్రీలక్ష్మిని హుటాహుటీన విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. కడుపులో ఉద్దేశపూర్వకంగా బలంగా కొట్టడం వల్ల తీవ్రమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ఇవాళ కూడా శ్రీలక్ష్మీని అబ్జర్వేషన్ లో కొనసాగించాలని చెబుతున్నారు.

మందడంలో పోలీసులదాడిలో గాయపడి విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఎర్రమనేని శ్రీలక్ష్మిని లోకేష్ పరామర్శించారు. ఏం జరిగిందనేది అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యపరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్.

ప్రస్తుతం శ్రీలక్ష్మి ఐసీయూలో చికిత్స పొందుతోంది..పోలీసులు బూటు కాలితో తన్నడం వల్లే శ్రీలక్ష్మి గాయపడిందని, తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోందని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story