శాంతిభద్రతల విషయంలో తెలంగాణ నెంబర్ వన్: మహమూద్ అలీ
By - TV5 Telugu |7 Jan 2020 3:41 AM GMT
శాంతిభద్రతల విషయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా ఉందన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. నాంపల్లి ఎగ్జిబిషన్లో జైళ్ల శాఖ ఏర్పాటు చేసిన ఖైదీల స్టాల్ను ఆయన ప్రారంభించారు. అన్ని జైళ్లను అభివృద్ధి చేయడమే కాకుండా.. ఖైదీలకు శిక్షణ, విద్య అందిస్తున్నామన్నారు. ఒకసారి జైలుకు వచ్చిన ఖైదీ మంచి మార్పుతో బయటికి వస్తున్నారన్నారు. ఇది అధికారుల సరైన శిక్షణ వల్లనే సాధ్యమని పేర్కొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com