దారుణం : స్తంభానికి కట్టి మహిళపై చెప్పులతో దాడి
By - TV5 Telugu |11 Jan 2020 7:44 AM GMT
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లితాండలో దారుణం జరిగింది. స్థల వివాదంలో అదే గ్రామానికి చెందిన కొందరు జ్యోతి అనే మహిళను స్తంభానికి కట్టేసి అమానవీయంగా చెప్పులతో కొట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
పక్కనే ఉన్న లక్ష్మీపురం గ్రామానికి చెందిన హంస, స్వరూప, రమకు పోరెడ్డిపల్లితండాలో వ్యవసాయ భూములున్నాయి. అయితే అందులోకి వెళ్లేదారి విషయంలో గొడవ జరిగింది. దీంతో ఆ మహిళల భర్తలపై జ్యోతి ఫిర్యాదు చేసింది. తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ వారు గ్రామంలోకి వెళ్లి జ్యోతిని స్తంభానికి కట్టేసి కొట్టారు. బాధిత కుటుంబ సభ్యులు డయల్ 100కి కాల్ చేయగా... పోలీసులు వచ్చి జ్యోతిని విడిపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com