'జేడీయూ'లోకి తేజ్ ప్రతాప్ మామ?

జేడీయూలోకి తేజ్ ప్రతాప్ మామ?

బీహార్ లో ఆర్జేడీ పార్టీకి భారీ షాక్ తగిలేలా ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యే చంద్రిక రాయి త్వరలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు చంద్రిక రాయి కూడా నితీష్ కుమార్ పై ప్రశంసలు కురిపించారు. బీహార్ అభివృద్ధిపై నితీష్ కు దూరదృష్టి ఉందని ఆయన కొనియాడారు. అంతేకాదు లాలూ.. ఆర్జేడీ పార్టీని కుటుంబ పార్టీగా మార్చేశారని ఆరోపించారు.

దాంతో ఎన్నికల ముందు చంద్రిక రాయి ఖచ్చితంగా జేడీయూలో చేరతారని బీహార్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి చంద్రిక రాయి లాలూ ప్రసాద్ యాదవ్ కు వియ్యంకుడే.. ఆయన కుమార్తె ఐశ్వర్య రాయ్ ను లాలు కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కు ఇచ్చి వివాహం చేశారు. అయితే వీరి వివాహం బంధం మొన్నల్లముచ్చట గా మారింది. తేజ్ ప్రతాప్ తనకు విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. అప్పటినుంచి చంద్రిక రాయ్, లాలు కుటుంబాల మధ్య సంబంధాలు వివాదంగా మారాయి.

Tags

Read MoreRead Less
Next Story