పుల్వామా అమరవీరులకు తోటి జవాన్లు నివాళి
By - TV5 Telugu |14 Feb 2020 2:03 PM GMT
పుల్వామా ఉగ్ర దాడికి నేటికి ఏడాది. పాక్ ఉగ్రమూకల దాడిలో అసువులు బాసిన అమరులను ప్రతి భారతీయుడు ఘనంగా స్మరించుకుంటున్నారు. జమ్మూకాశ్మీర్లోని లేత్పొరాలో ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు.. తోటి వీర జవాన్లకు ఘన నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు.
గతేడాది ఫిబ్రవరి 14న రెండు వేల మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది 70కిపైగా వాహనాల్లో శ్రీనగర్కు బయలుదేరారు. ఈ క్రమంలో ఓ ముష్కరుడు కారులో కాన్వాయ్ పక్కకు వచ్చి తన వాహనాన్ని పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో మొత్తం 40 మంది సీఎఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com