పండగ రోజులా.. కేసీఆర్ పుట్టినరోజు
సీఎం కేసీఆర్ 66వ పుట్టిన రోజు వేడుకలు వైభవంగా నిర్వహించాయి గులాబీ శ్రేణులు. తెలంగాణ కేసీఆర్ పుట్టిన రోజును పండుగ రోజుగా జరుపుకున్నారు అభిమానులు, కార్యకర్తలు. అభిమాన నేత జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం నిర్వహించారు. ఈచ్ వన్ ప్లాంట్ వన్ నినాదంతో.. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటారు.
కేసీఆర్కు ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు కేటీఆర్, హరీష్... సీఎం కేసీఆర్ శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.
కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్నినిర్వహించారు. పలువురు విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు. తెలంగాణలో భవన్లో మొక్కలు నాటిన టీఆర్ఎస్ నేతలు.. పేదలకు బట్టలు పంపిణీ చేశారు.
హైదరాబాద్ జలవిహార్లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న ఎంపీ సంతోష్ కుమార్.. మొక్కలు నాటారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీ కె.కేశవరావుతో పాటు పలువురు నేతలు కేక్ కట్ చేశారు.
సీఎం కేసీఆర్ జన్మదినవేడుకల్లో పాల్గొన్నాడు ఆయన మనవడు, కేటీఆర్ కుమారుడు, హిమాన్ష్. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో కలిసి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. వీణావాణీలతో కలిసి కేక్ కట్ చేశాడు. అనంతరం.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో పూజలు చేశాడు.
మహబూబ్నగర్లో కేసీఆర్ జన్మదిన వేడుకలను మంత్రి శ్రీనివాస్గౌడ్ ఘనంగా నిర్వహించారు. పద్మావతి కాలనీలో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డు డివైడర్లో మొక్కలు నాటి హరితహారం చేపట్టారు. అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి.. పళ్లు, బియ్యం, స్కూల్ బ్యాగ్లు పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా.. లోకాయుక్త జస్టీస్ సీవీ రాములు, ఉపలోకాయుక్త వి. నిరంజన్ రావు హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. బషీర్బాగ్ లోకాయుక్త కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
సూర్యపేట జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి జగీదీష్రెడ్డి. తన క్యాంప్ కార్యాలయంలో కేట్కట్ చేసారు. అనంతరం రక్తదానశిభిరం ఏర్పాటు చేశారు. అనంతరం... టేకుమట్ల,మూసీ రహదారిలో 6600 మొక్కలు నాటారు.
సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ జన్మదినవేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలో లక్షా10 వేల మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు మంత్రి హరీష్. నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యత తీసుకోవాలని ప్రజలకు సూచించారు. మొక్కలు నాటడం కన్నా వాటిని సంరక్షించడం గొప్ప పని అన్నారు మంత్రి హరీష్.
సెక్రటేరియట్లో.. ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సెక్రటేరియట్ సిబ్బంది.. సీఎం కేసీఆర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com