మంచినీళ్లు ఇస్తానని విద్యార్థినులతో మాయమాటలు చెప్పిన పోకిరి..

మంచినీళ్లు ఇస్తానని విద్యార్థినులతో మాయమాటలు చెప్పిన పోకిరి..

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఓ పోకిరీపై దిశ, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. బీ.ఆర్‌.ఎం.వి స్కూలల్లో ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు మంచునీళ్లు తాగేందుకు బయటకు వెళ్లారు. స్కూల్‌కి దగ్గరగా ఉన్న ఇంటికి వెళ్లి మంచినీళ్లు అడిగారు.. ఆ ఇంట్లో ఉన్న నిమ్మల శివ కృష్ణ.. ఆ బాలికలకు ఇంట్లోకి వస్తే మంచినీళ్లు ఇస్తానని మాయమాటలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. నీళ్ల కోసం ఇంట్లోకి వచ్చిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించాడు.. జరిగిన విషయాన్ని ఆ ఇద్దరు విద్యార్థిణులు తోటి విద్యార్థులకు చెప్పడంతో.. వారు స్పందించి స్కూల్‌ సిబ్బందికి విషయం చెప్పారు. స్కూల్‌ యాజమాన్యం ఫిర్యాదుతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దిశ, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story