ఐస్ క్రీం తినడంతో నోటి నుంచి రక్తం

ఐస్ క్రీం తినడంతో నోటి నుంచి రక్తం

హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఐస్ క్రీం తిన్న వారి నోటి నుంచి రక్తం రావడం కలకలం రేపింది. పాతబస్తీలోని ఒవైసీ కాలనీలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. ఓవైసీ నగర్ లోని ఫయాజ్‌ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు.. రోడ్లపై తిరుగుతూ ఐస్ క్రీంలు అమ్మే తోపుడు బండి దగ్గర ఐస్ క్రీం కొనుగోలు చేసి తిన్నారు. అది నాలుకపై వేసుకున్న వెంటనే నాలుక పగిలి రక్తం రావడాన్ని గుర్తించి ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఐస్‌ క్రీం అమ్మిన వ్యక్తిని పట్టుకొని.. సంతోష్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఐస్‌ క్రీం అమ్మిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story