గండిపేట్ మండలం టీఆర్ఎస్ అధ్యక్షుడిపై దాడి.. పరిస్థితి విషమం
By - TV5 Telugu |2 March 2020 2:04 PM GMT
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం టీఆర్ఎస్ అధ్యక్షుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గతంలో సర్పంచ్ గా పని చేసిన నర్సింహాపై కొందరు దుండగులు మూకుమ్మడి దాడి చేశారు. తలపై కర్రలతో దాడి చేయడంతో ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నార్సింగ్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పోటీ చేసి నర్సింహా ఓడిపోయారు. అయితే గతంలో ఉన్న గొడవలే ఈ దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com