గండిపేట్ మండలం టీఆర్ఎస్ అధ్యక్షుడిపై దాడి.. పరిస్థితి విషమం

గండిపేట్ మండలం టీఆర్ఎస్ అధ్యక్షుడిపై దాడి.. పరిస్థితి విషమం

రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం టీఆర్ఎస్ అధ్యక్షుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గతంలో సర్పంచ్ గా పని చేసిన నర్సింహాపై కొందరు దుండగులు మూకుమ్మడి దాడి చేశారు. తలపై కర్రలతో దాడి చేయడంతో ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నార్సింగ్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పోటీ చేసి నర్సింహా ఓడిపోయారు. అయితే గతంలో ఉన్న గొడవలే ఈ దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story