రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్ఎస్
TRS రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు సీఎం కేసీఆర్. సీనియర్ నేత కేశవరావుకు మరో అవకాశం ఇచ్చారు. ఇక రెండో అభ్యర్థిగా మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డిని ఎంపిక చేశారు. ఇద్దరు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. సీఎం కేసీఆర్.. కేకే, సురేష్రెడ్డిలను అభినందించారు. రాజ్యసభకు ఎంపిక చేసినందుకూ ఇద్దరూ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
సీనియర్ నేత కె. కేశవరావు మూడోసారి రాజ్యసభకు వెళ్లనున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి, రెండుసార్లు టీఆర్ఎస్ నుంచి అవకాశం దక్కింది. రాజకీయాల్లో కేకేకు సుదీర్ఘ అనుభవం, పీసీసీ చీఫ్గా కూడా పనిచేశారు. టీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి కేసీఆర్కు రైట్హ్యాండ్గా వ్యవహరిస్తున్నారు. ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించినప్పుడు కేకే చాలా కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీ స్థాయిలో వివిధ పార్టీల నేతలు, ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు. సీనియార్టీ, పార్టీలో ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా కేకేకు మరోసారి అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్.
మాజీ స్పీకర్ సురేష్రెడ్డికి కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.. బాల్కొండ నుంచి 89, 94, 99, 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 నుంచి 2009 వరకు స్పీకర్గా పనిచేశారు..అయితే డీలిమిటేషన్లో భాగంగా 2009లో ఆర్మూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు సురేష్ రెడ్డి. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఆక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉన్నారు...2018, సెప్టెంబర్-7న TRSలో జాయిన్ అయ్యారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com