న‌ర్సుగా మారిన హీరోయిన్

న‌ర్సుగా మారిన హీరోయిన్

ఇండియాలో కరోనా మహమ్మరిని కట్టడికి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మూడు వారాల పాటు లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టడం లేదు. ఇది కొంతమందికి కొన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా.. కొందరు మాత్రం ఈ సమయాన్ని ఫ్యామిలితో బాగా ఎంజాయ్ చేస్తు గడుపుతున్నారు. అయితే మరి కొంతమందికి ఏం చేయాలో తెలియక ఉన్న సమయాన్ని ఎలా గడపాలో కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది తమ స‌మ‌యాన్ని వృథా చేసుకుంటున్నారు. కాని కొందరు మాత్రం స‌మాజ సేవ‌కు స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ న‌టి షికా మ‌ల్హోత్ర కూడా ఉన్నారు. షికా మ‌ల్హోత్ర తన సమయాన్ని సమాజ సేవకు కేటాయిస్తున్నారు. స‌మాజ హితం ఆమె న‌ర్సుగా మారిపోయారు. మ‌హారాష్ట్ర‌.లో క‌రోనా పాజిటివ్ కేసుల బాధితులు ఎక్కువ‌గా ఉన్నారు. అక్క‌డ డాక్ట‌ర్లు, న‌ర్సుల కొర‌త అధికంగా ఉంది. ఈ నేప‌థ్యంలో కొంత‌మందికైనా వైద్య సేవ‌లు అందించేందుకు షికా మ‌ల్హోత్ర నడుం బిగించారు.

ఆమె గ‌తంలో ఢిల్లీలోని వ‌ర్ధ‌మాన్ మ‌హ‌వీర్ మెడిక‌ల్ కాలేజీలో న‌ర్సింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. మూవీ అవ‌కాశాలు రావ‌డంతో ఆమె వృత్తిని వ‌దిలి సినిరంగంలోకి అడుగు పెట్టారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో క‌రోనా వైర‌స్ వ్యాపిస్తున్న నేప‌థ్యంలో ఆమె మ‌ళ్లీ న‌ర్సుగా మారి సేవ చేయాల‌నుకున్నారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని బాలాసాహెబ్ థాక్రే ట్రామా సెంటర్‌లో పని చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story