ఆ దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ను సప్లై చేస్తాం : కేంద్రం
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడేందుకు మానవతా దృక్పథంతో ఆలోచించి భారత్ పారాసిటమాల్, హైడ్రాక్సిక్లోరోక్విన్ను ఎగుమతి చేయాలనుకుంటుంది. అది కూడా వైరస్ కారణంగా బాగా దెబ్బతిన్న దేశాలకు సాయం చేయాలనుకుంటుంది.
అమెరికాలో వేలాది మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో సాయం చేయాలని అధ్యక్షుడు ట్రంప్ భారత్ ను శరణుకోరారు. భారత్ వాడే డ్రగ్ ని తమ దేశానికి ఎగుమతి చేయాలని అడిగారు.
అయితే ప్రపంచ దేశాల డిమాండ్ మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ అత్యవసరంగా అవసరమున్న దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మానవతా కోణంలో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పారాసిటమాల్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ను తగిన పరిమాణంలో పొరుగు దేశాలకు సరఫరా చేస్తామని చెప్పింది.
కరోనా దృష్ట్యా దేశంలో ఔషధాల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. మార్చి 3న విడుదల చేసిన నోటిఫికేషన్కు సవరణలు చేస్తూ తాజాగా మరో నోటిఫికేషన్ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ జారీ చేసింది. 12 రకాల యాంటీ బయోటిక్స్, 12 రకాల ఫార్ములేషన్లపై ఉన్న నిషేధాన్ని కేంద్రం సడలించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com