తెలుగు వాళ్లను ఆదుకోవాలంటూ చంద్రబాబు లేఖలు

తెలుగు వాళ్లను ఆదుకోవాలంటూ చంద్రబాబు లేఖలు

తమిళనాడులో చిక్కుకున్న తెలుగు వారికోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖలు రాశారు. మే 3 వరకు లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం పొడిగించిన ఈ నేపథ్యంలో.. చెన్నైలో చిక్కుకుపోయిన 1500 మంది భవననిర్మాణ తెలుగు కార్మికులను ఆదుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఆయన విడివిడిగా లేఖలు రాశారు. మే 3 వరకు తమ వారికి వసతి, ఆహారం, వైద్యసదుపాయాలతోపాటు నిత్యావసరాలను అందించాలని చంద్రబాబు కోరారు.

శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు చెంది కూలీలు చెన్నై, తమిళనాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో చిక్కుకుపోయారని.. వారి యోగక్షేమాల పట్ల కుటుంబసభ్యులు ఆందోళనతో ఉన్నారని లేఖలో ప్రస్తావించారు. ఇరువురికి రాసిన లేఖల్లో బాధితుల వివరాలు, ఫోన్‌ నెంబర్లు జతపరిచారు.

Tags

Read MoreRead Less
Next Story