ఈ-ఆహార్‌ యాప్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

ఈ-ఆహార్‌ యాప్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ-ఆహార్‌ యాప్‌ను ప్రారంభించారు. ఇంటింటికి నిత్యావసర సరుకులు, కూరగాయలు రవాణా చేసేందుకు రూపొందించిన ఈ-ఆహార్‌ యాప్‌ను మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు.

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేస్తోంది తెలంగాణ సర్కార్ . కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాగా ప్రజల అవసరాలు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు హరీశ్‌రావు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story