భారత్‌లో ఒక్కరోజులోనే 56 మంది మృతి

భారత్‌లో ఒక్కరోజులోనే 56 మంది మృతి

ఇండియాలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. దేశంలో ఈ ప్రాణాంతకర వైరస్ రోజు రోజుకి వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,490 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడి ఒక్కరోజే 56 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 779 మంది మృతి చెందారు. భారత్‌లో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ల సంఖ్య 24,942కు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story