మే 1న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: పంజాబ్ కాంగ్రెస్
By - TV5 Telugu |30 April 2020 7:07 PM GMT
మే 1న కార్మిక దినోత్సవం రోజున పంజాబ్ కాంగ్రెస్ వినూత్న నిర్ణయం ప్రకటించింది. కరోనాపై పోరుకు మద్దతుగా మే 1న ప్రజలంతా తమ ఇళ్ళపై జాతీయ జెండాలను ఎగురవేయాలని కోరింది. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జక్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా కోవిడ్-19పై పోరుకు మద్దతుగా నిలవాలన్నారు. ఈ సంక్షోభ సమయంలో కార్మిక దినోత్సవంనాడు ఈ మహమ్మారిపై పోరాటానికి మద్దతుగా సంఘీభావం ప్రకటించాలన్నారు. అటు.. కేంద్రం నుంచి తమకు సాయం కావాలని.. తెలిపేందుకు గుర్తుగా జాతీయ జెండాలను ఎగురవేయాలని కోరారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com