భారత్‌లో గడచిన 24 గంటల్లో కరోనాతో 71 మంది మృతి

భారత్‌లో గడచిన 24 గంటల్లో కరోనాతో 71 మంది మృతి

భారత్‌లో కరోనా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. దేశంలో ఈ మహమ్మారి రోజు రోజుకీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ బారిన పడి ప్రణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారత్‌లో గడచిన 24 గంటల్లో కరోనా వైరస్‌తో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కొత్తగా 2,293 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 37,336కి చేరింది. భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,218 కు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story