ఇండియాలో 40వేలు దాటిన కరోనా కేసులు

ఇండియాలో 40వేలు దాటిన కరోనా కేసులు

ఇండియాలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 40వేలు దాటాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 2487 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి గడచిన 24 గంటల్లో 83 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 40,263కు చేరింది. ఈ ప్రాణాంతకర వైరస్ కారణంగా ఇప్పటి వరకు 1306 మంది మృతి చెందారు.

Tags

Read MoreRead Less
Next Story