మద్య నిషేధం చేయాలంటూ విశాఖలో తెలుగు మహిళల ఆందోళన
By - TV5 Telugu |12 May 2020 2:39 PM GMT
వైసీపీ ఎన్నికల హామీ ప్రకారం సంపూర్ణ మద్యనిషేధం చేయాలని టీడీపీ మహిళా విభాగం డిమాండ్ చేసింది. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత నేతృత్వంలో మహిళలు దీక్షకు దిగారు. మద్యం బాటిళ్లు పగులగొట్టి నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మద్యం షాప్ ఓపెన్ చేసి ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. మద్యం షాపులు ఓపెన్ చేయడం వల్లనే విశాఖ రెడ్జోన్గా మారిందని విమర్శించారు. అలాగే అధిక మద్యం రేట్లు పేద ప్రజలకు భారంగా మారాయని తెలుగు మహిళలు మండిపడ్డారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com