తెలంగాణలో వరుసగా నాలుగో రోజు కరోనా విజృంభన.. 51 కేసులు
By - TV5 Telugu |12 May 2020 11:27 PM GMT
వరుసగా నాలుగోరోజు తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య ఎక్కువగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 51 కేసులు నమోదయ్యాయని.. రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1326కి చేరింది. ఈరోజు నమోదైన కేసుల్లో 37 హైదరాబాద్ లో కాగా.. మరో 14కేసులు వలస కార్మికులు అని గుర్తించారు. ఈ రోజు 21 మంది డిశ్చాజ్ కాగా.. ఇద్దరు చనిపోయారు. ఇప్పటి వరకూ.. 822 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 472 మంది చికిత్స పొందుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com