తెలంగాణలో వీటికి అనుమతి లేదు : కేసీఆర్
తెలంగాణలో లాక్డౌన్ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు మినహా.. మిగతావన్నీ గ్రీన్జోన్లేనని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం తప్ప అన్నిచోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు అని కేసీఆర్ స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్లు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే లాక్డౌన్ 4.0 సడలింపులు ఇస్తున్నా.. రాష్ట్రంలో వీటికి మాత్రం అనుమతులు ఉండబోవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
* అన్ని రకాల విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు బంద్
* సినిమాథియేటర్లు, షాపింగ్ మాల్స్ , పంక్షన్ హాల్స్కు అనుమతి లేదు.
* బార్లు, పబ్బులు, క్రీడామైదానాలు,క్లబ్ లు, జిమ్లు, పార్కులు బంద్
* మెట్రో రైలు సర్వీసులు బంద్
* హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు తిరగవు
*అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి లేదు.
*అన్ని రకాల ప్రార్థనా మందిరాలు.. దేవాలయాలు మూసివేత
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com