నియంత్రిత పంటల సాగు విధానంపై కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయతలపెట్టిన నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారు చేసేందుకు మరికాసేపట్లో ప్రగతి భవన్లో విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ నేరుగా చర్చించి జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటలపై చర్చిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి? వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ ఎంత వేయాలి? అనే అంశాలను నిర్ణయించేందుకు గత పదిరోజులుగా వ్యవసాయాధికారులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు సమావేశాలు జరిపారు. కేసీఆర్ సమావేశం తర్వాత జిల్లాల వారీగా పంటల మ్యాప్ను రూపొందిస్తారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com