తెలంగాణలో తాజాగా 5 కరోనా మరణాలు.. 38 కొత్త కేసులు

తెలంగాణలో తాజాగా 5 కరోనా మరణాలు.. 38 కొత్త కేసులు

తెలంగాణలో గురువారం 38కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 1699కి చేరిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అయితే, తాజా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీలో 26కేసులు, రంగారెడ్డి జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. అటు, 10మంది వలసకూలీలకు కూడా కరోనా సోకినట్టు గుర్తించారు. అయితే, గురువారం ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాలు 45 చేరాయి. గడిచిన 24 గంటల్లో 23మంది డిశ్చార్జ్ అవ్వగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1036 మంది డిశ్చార్జ్ అయ్యారు. అటు, ఇంకా 618 మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story