ఏకకాలంలో రెండు డిగ్రీలు.. యూజీసీ నూతన ప్రతిపాదన
By - TV5 Telugu |22 May 2020 7:05 PM GMT
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విద్యార్థులకు కొత్తగా ఓ వెసులుబాటు కల్పిస్తుంది. ఒకేసారి రెండు డిగ్రీలను పూర్తి చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్ ఈ విషయం తెలిపారు. అయితే, రెండు కోర్సులు రెగ్యూలర్ గా చేసేందుకు వీలు లేదని.. ఒకటి రెగ్యూలర్ లో, మరో కోర్సు ఆన్లైన్ లో లేదా డిస్టెన్స్ లో కానీ చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ప్రతిపాదన ఏడేళ్ల నుంచి ఉందని.. అయితే.. పలు కారణాల వలన ఇది వాయిదా పడుతూ వస్తుందని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన ప్రకటన అధికారంగా త్వరలో రానుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com