తూర్పు మన్యంలోకి వ్యాపించిన కరోనా.. నాలుగు నెలల బాలుడికి సోకిన వైరస్
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్....ఇప్పటి వరకు తూర్పు మన్యం దరిచేరలేదు. కానీ ఇప్పుడు రంపచోడవరం మండలం, బోలగొండ పంచాయితీ చెరువూరు గ్రామానికి కరోనా వ్యాపించింది. ఈ ఊళ్లో 4 నెలల బాలుడికి కరోనా సోకింది. కాకినాడ డాక్టర్లు దీన్ని నిర్ధారణ చేయడంతో.. గిరిజనులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనతో.. ఐటీడీఏ అధికారులు అప్రమత్తమై.. చెరువూరుతో పాటు సమీప గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన శానిటైజేషన్ చేయించారు. ప్రస్తుతం రెడ్ జోన్గా ప్రకటించి రాకపోకలు బంద్ చేశారు అధికారులు. ఈ కుటుంబంతో కాంటాక్ట్ అయిన వారందరికి కరోనా టెస్ట్లు చేస్తున్నారు.
ఈ నెల 14న జ్వరం రావడంతో.. బాబును వాడపల్లి పీహెచ్సీకి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అయినా అక్కడ నయం కాకపోవడంతో.. మరుసటి రోజే.. రంపచోడవరం తరలించారు. అక్కడ్నుంచి కాకినాడకు తరలించి కరోనా పరీక్షలు చేశారు. చివరికి ఆ బాలుడికి కరోనా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో.. చెరువూరుతో పాటు సమీప గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com