బుల్లితెర నటి ఆత్మహత్య.. ఇన్‌స్టాలో పోస్ట్..

బుల్లితెర నటి ఆత్మహత్య.. ఇన్‌స్టాలో పోస్ట్..

బుల్లితెర నటి ప్రేక్షా మెహతా ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ప్రేక్ష తన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు లేవు. రెండు నెలల నుంచి ఖాళీగా ఇంట్లో కూర్చోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కాగా, ప్రేక్షామెహతా సోమవారం రాత్రి సూసైడ్‌ చేసుకునే ముందు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.

జీవితంలో ఎన్నో కలలు కంటాము. అవి నెరవేకపోవడం చాలా బాధాకరం అని ఆమె పోస్ట్ చేశారు. క్రైమ్ పెట్రోల్, లాల్ ఇష్క్, మేరీ దుర్గ సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను అలరించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్నందున అన్ని సినిమాలు, టీవీ ప్రాజెక్టులకు సంబంధించి రెండు నెలలుగా షూటింగ్‌లు ఆగిపోయాయి. కొద్ది రోజుల క్రితం టీవీ నటుడు మన్మీత్ గ్రెవాల్ ముంబైలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్డౌన్ కారణంగా పని కోల్పోవడం వల్లే అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story