ఢిల్లీలో కొత్తగా 792 కరోనా కేసులు

ఢిల్లీలో కొత్తగా 792 కరోనా కేసులు

ఢిల్లీలో కరోనావైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. బుధవారం 15 వేల మార్కును దాటింది. గత 24 గంటల్లో 792 కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి, తాజా కరోనావైరస్ కేసులతో 15,257 కు చేరుకుంది. అలాగే ఢిల్లీలో కరోనావైరస్ మరణాల సంఖ్య 303 కు పెరిగింది. అయితే ఇప్పటివరకు కనీసం 7,264 మంది రోగులు కరోనావైరస్ నుండి కోలుకున్నారు.. దీంతో ఇప్పడు మొత్తం 7690 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఢిల్లీ ప్రతి వారం 500 లేదా అంతకంటే ఎక్కువ కేసులను వారంలో నివేదిస్తోంది.

అయితే, తాజాగా ఒక రోజులో 700 కి పైగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇదిలావుంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం COVID-19 కేసులు 1,51,767 కు పెరిగాయి. COVID-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 4,337 కు చేరుకుంది. చికిత్స పొందుతున్న వారి సంఖ్య 83,004 గా ఉంది.. ఇప్పటివరకు 64,425 మంది కోలుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story