పార్టీ నుంచి ఒకరు పోతే వంద మందిని తయారు చేస్తా: చంద్రబాబు
By - TV5 Telugu |10 Jun 2020 7:55 PM GMT
వైసీపీ ఏడాది పాలన, అధికార పార్టీలోకి కొనసాగుతున్న వలసలపై ఘాటుగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. దశాబ్దాలుగా కొందరు టీడీపీలో పదవులు పొందరాన్నారు. పార్టీ నుంచి కార్యకర్తల నుంచి గౌరవం పొందారని, ఇప్పుడు వేధింపులకు భయపడి పార్టీ మారడం పిరికితనమని అన్నారు. బెదిరింపులతో ప్రలోభాలతో వైసీపీ కొందరిని లోబరుచుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు. ఒకరుపోతే వంద మందిని తయారు చేస్తామన్నారు. ఒకరిద్దరు పార్టీ నుంచి పోయినా ఏమీ కాదన్నారు. పార్టీ మారిన వారు కనుమరుగయ్యారని, తెలుగుదేశం పార్టీ రాజకీయ విశ్వవిద్యాలయమని చంద్రబాబు అన్నారు. మళ్లీ సమర్థ నాయకత్వాన్ని తయారు చేస్తామని ధీమాగా చెప్పారు. రాబోయే 40 ఏళ్లకు దీటైన నాయకత్వాన్ని తయారు చేస్తామన్నారు చంద్రబాబు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com