రసాభాసగా మారిన వైసీపీ ఎంపీ ప్రెస్‌మీట్

రసాభాసగా మారిన వైసీపీ ఎంపీ ప్రెస్‌మీట్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.. తన అనంతపురం పర్యటనలో సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని అన్నారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. ఈ సందర్భంగా గోరంట్ల నిర్వహించిన ప్రెస్‌మీట్ రసాభాసగా మారింది. వాహనాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని.. ఈ అక్రమాలకు సూత్రధారి జేసీ ప్రభాకర్ రెడ్డే అంటూ ఆరోపించారు. వాహనాలను కొనుగోలు చేసినవారిని మీడియాకు పరిచయం చేశారు.

అయితే, వాహనాలు ఎవరిదగ్గర కొన్నారు? చెక్కులు ఎవరి పేరుమీద ఇచ్చారని.. కొనుగోలుదారులను కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి నేరుగా డబ్బులు కట్టారా? అని ప్రశ్నించగా.. ఆయన ఇంట్లో ఉండే ప్రభాకర్ అనుచరుడు నాగేశ్వర్ రెడ్డి డబ్బులు తీసుకున్నారని సమాధానం చెప్పారు. దీనిపై ఓ మీడియా ప్రతినిధి క్లారిటీ కోరడంతో అక్కడే వున్న తాడిపత్రి వైసీపీ నేత కాకర్ల రంగనాథ జోక్యం చేసుకున్నారు. దీంతో వివాదం తలెత్తింది. ఓ దశలో మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎంపీ గోరంట్ల ప్రెస్‌మీట్ రసాభాసగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story