నీ బాధను నాకు పంచుకునే వీలుంటే..

నీ బాధను నాకు పంచుకునే వీలుంటే..

క్షమించు తమ్ముడూ.. నీ బాధను నేను తీసుకునే వీలుంటే ఎంత బావుండేది. నీ కళ్లు, నీ హృదయం ఎంతో ప్రేమాస్పదం అంటూ సుశాంత్ సోదరి భాధాతప్త హృదయంతో ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు అందరి హృదయాలను కలచి వేస్తుంది. సోదరి శ్వేతాసింగ్ కీర్తి.. ఇటీవలే పాట్నా నుంచి అమెరికా వెళ్లింది. తమ్ముడు లేడన్న వార్తను జీర్ణించుకోలేని ఆమె ఫేస్ బుక్ లో ఇలా రాసుకొచ్చారు. నువ్వు చాలా బాధలో ఉన్నావని నాకు తెలుసు.. ఇన్ని రోజులు ధైర్యంగా పోరాడావు. వృత్తిపరమైన పోటీ కారణంగా నిరాశకు గురయ్యావు.

2019లో వచ్చిన చిచోర్ చిత్రం తర్వాత మరో 7 చిత్రాలు వచ్చినట్టే వచ్చి ఆగిపోయాయి. నీ మెరిసే కళ్లు ఎన్నెన్ని కలలు కన్నాయో నాకు తెలుసు. నీ అమాయకపు చిరునవ్వు, నీ హృదయం యొక్క స్వచ్ఛమైన ప్రేమను తెలుపుతుంది. నా బేబీ.. నువ్వెక్కడ ఉన్నా సంతోషంగా ఉండు. ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమిస్తున్నారు అని తన ప్రియ సోదరుడి గురించి రాశారు.

సుశాంత్ ని ప్రేమించే వారిని ఉద్దేశిస్తూ.. వీలైనంత ప్రేమను పెంచుకోండి. మీ హృదయాన్ని ద్వేషంతో నింపొద్దు. ఇతరుల పట్ట ప్రేమతో, దయతో ఉండండి. కరుణను పెంచుకోండి. క్షమించే గుణాన్ని అలవరచుకోండి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎన్నో విషయాలపై పోరాడుతుంటారు. ఇతరుల పట్ల కాస్త కనికరం చూపిస్తూ ప్రేమా ఆప్యాయతలను పంచండి అది వారికి ఎంతో సంతృప్తిని ఇస్తుంది. కాగా, సుశాంత్ రాజ్ పుత్ చివరిసారిగా నెట్ ప్లిక్స్ చిత్రం డైవ్ లో కనిపించాడు. అతడి రాబోయే చిత్రం దిల్ బెచారా.. ఇది కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేదు.

Tags

Read MoreRead Less
Next Story