శాసనమండలి వీడియోలు బయటపెట్టండి.. నిజాలు తెలుస్తాయి: టీడీపీ నేత

శాసనమండలి వీడియోలు బయటపెట్టండి.. నిజాలు తెలుస్తాయి: టీడీపీ నేత

శాసనమండలిలో అధికార వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మండిపడ్డారు. 18 మంది మంత్రులు నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడరని అన్నారు. అసభ్యకరంగా వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే శాసనమండలి వీడియోలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వీడియోలు బయటకొస్తే ఎవరు దాడి చేశారో తెలుస్తుందని అన్నారు దీపక్ రెడ్డి.

Tags

Read MoreRead Less
Next Story