మీతో నీతులు చెప్పించుకునే స్థాయిలో మేము లేము.. వైసీపీకి బీజేపీ కౌంటర్

మీతో నీతులు చెప్పించుకునే స్థాయిలో మేము లేము.. వైసీపీకి బీజేపీ కౌంటర్

ఏపీ మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్.. ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ భేటీపై రాష్ట్ర బీజేపీ స్పందించింది. వైసీపీ విమర్శలకు బీజేపీ ఘాటుగా సమాధానం చెప్పింది. ప్రభుత్వంపై వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తున్నారని.. వారికి సమాధానం చెప్పకుండా.. ప్రజల దృష్టి మార్చడానికి వీరి భేటీ విషయాన్ని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని బీజేపీ అధికారిక ట్విటర్ వేదికగా మండిపడింది. అసలు రమేష్ కుమార్ ను మీరు ఎన్నికల కమిషనర్ గా గుర్తించారా అని ప్రశ్నించారు. ఆయన విషయంలో కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నారా అని అన్నారు. మీతో నీతులు చెప్పించుకునే స్థాయిలో బీజేపీ లేదని ఘాటుగా స్పందించారు. ఇటీవల హైదరాబాద్ లో పార్క్ హయాత్ లో ఎస్ఈసీ రమేష్ కుమార్, ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కలిసిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story