ఆ కుటుంబాన్ని పార్టీ ఆదుకుంటుంది : నారా లోకేశ్
By - TV5 Telugu |26 Jun 2020 1:46 PM GMT
టీడీఎల్పీ ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం వెళ్లారు. దారిలో రాజమహేంద్రవరంలో ఆయన కాసేపు ఆగారు. మోరంపూడి జంక్షన్లో.. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ యువనాయకులు లోకేష్కు ఘన స్వాగతం పలికారు. అక్కడి నేతలను పలకరించిన లోకేష్.. అందరితో మాట్లాడారు. ఇటీవల మృతి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త, 32వ డివిజన్కు చెందిన మహంతి ధుర్యోధనుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్లు లోకేష్కు వినతి పత్రం అందించారు. ఆ కుటుంబాన్ని పార్టీ ఆదుకుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. అనంతరం శ్రీకాకుళం జిల్లాకు బయల్దేరి వెళ్లారు లోకేష్.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com