ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. తెలంగాణ నుంచి అమ్మవారికి బోనాలు
ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయి. జులై 3వ తేదీ నుంచి.. మూడు రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు తెలిపారు. ఈ ఉత్సవాలు జూలై 3న ఉదయం 6 గంటలకు ప్రారంభమై.. 5న ఉదయం పుర్ణాహుతితో ముగుస్తాయని తెలిపారు. శాకంబరీ ఉత్సవాలకు వచ్చే భక్తులు టికెట్లను ఆన్లైన్ స్లాట్ ప్రకారం టిక్కెట్ బుక్ చేసుకునే రావాలన్నారు. కరోనా దృష్ట్యా శాకంబరీ ఉత్సవాల తొలి రెండు రోజులు అంతరాలయంలో మాత్రమే శాకంబరీ అలంకారం నిర్వహించనున్నారు.
ఆషాడ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి బోనాల కమిటీ సభ్యులు జూలై 5న అమ్మవారికి బోనాలు సమర్పిస్తారన్నారు. జులై 1 నుంచి దేవస్ధాన కేశఖండన శాల నందు తలనీలాలు తీసేందుకు అనుమతిస్తున్నామన్నారు. 10 సంవత్సరాల లోపు 60 సంవత్సరాలు పై బడిన వారికి అనుమతి లేదని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com