నా కుమారుడిని ఎన్ కౌంటర్ చేయండి: వికాస్ దూబే తల్లి

నా కుమారుడిని ఎన్ కౌంటర్ చేయండి: వికాస్ దూబే తల్లి

ఉత్తరప్రదేశ్ లో పోలీసులపై కాల్పులు జరిపి ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ ఘటనపై దూబే తల్లి సరళాదేవి స్పందించారు. పోలీసులను తన కుమారుడు చంపేసాడని టీవీలో చూశానని.. అలా చేసి చాలా పెద్ద తప్పు చేశాడని ఆమె అన్నారు. తన కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలిసినా.. పోలీసులు ఎందుకు పట్టుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. వికాక్ తనంతట తాను లొంగిపోవాలని.. లేదంటే పోలీసులు ఎన్ కౌంటర్ చేయాలని ఆమె సూచించారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడిన తరువాత ఇలా తయారయ్యాడని ఆమె తెలిపింది. నాలుగు నెలల నుంచి తన కొడుకుని కలవలేదని ఆమె తెలపారు. తన చిన్న కొడుకుతో ఉంటున్నాని ఆమె తెలిపారు. అటు, వికాస్ దూబేను పట్టుకోవడానికి 25 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. దూబే ఆచూకీ చెప్పిన వారికి పోలీసులు 50 వేల నజరాన ప్రకటించారు. కాగా, నేరస్థుడైన దూబేను అదుపులోని తీసుకొనేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో 8మందిపోలీసులు మరణించారు. అటు పరారైన దూబే గ్యాంగ్ లో ఇద్దరిని పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story