మహారాష్ట్ర పోలీసులపై పంజా విసురుతున్న కరోనా
By - TV5 Telugu |4 July 2020 8:16 PM GMT
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశంలో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో మొదటిస్థానంలో ఉంది. ఇక కరోనా కట్టడిలో ముందుండి పోరాటం చేస్తున్న పోలీసులు కూడా ఎక్కువగా మహమ్మారి సోకడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గడిచిన 72 గంటల్లో 237 మంది పోలీసులుకు కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన పోలసుల సంఖ్య 1,040కి చేరింది. అటు, ఇప్పటి వరకూ మొత్తం 64 మంది పోలీసులు కరోనాతో మృతి చెందారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనే ఎక్కువ కేసులు నమోదు కావడంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం పడుతోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com