రౌడీషీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చేసిన అధికారులు
By - TV5 Telugu |4 July 2020 7:55 PM GMT
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే అనుచరులు పోలీసులపై కాల్పులు జరిపి ఎనిమిది మందిని చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరినప్పటి నుంచి దూబే కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దూబే గ్యాంగ్ లో ఇద్దరిని ఎన్ కౌంటర్ చేశారు. అయితే, దూబే ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో, అధికారులు దూబే ఇంటిని కూల్చివేశారు. దీంతో పాటు ఆయన ఇంటిముందు ఉన్న వాహనాలను కూడా ద్వంసం చేశారు. ఈ వ్యవహారమంతా పోలీసుల పర్యవేక్షణలోనే జరిగింది. కాగా, పోలీసులపై కాల్పుల ఘటనపై స్పందించిన దూబే తల్లి.. తన కొడుకు చేసింది చాలా తప్పని తేల్చిచెప్పింది. పోలీసులకు వికాస్ లొంగిపోవాలని లేని యడల పోలీసుల వికాస్ ను ఎన్ కౌంటర్ చేయాలని స్పష్టం చేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com