కుప్పంలో 20 మంది దళితుల ఇళ్ళు కూల్చివేత

కుప్పంలో 20 మంది దళితుల ఇళ్ళు కూల్చివేత

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చివేయడం వివాదాస్పదం అయింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు వాటిని కూల్చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో అమరావతి కాలనీలో 20 మంది దళితులకు ఇళ్ళు కేటాయించారు.. అయితే వీటిని ఇప్పుడు కూల్చివేయడం చర్చనీయాంశం అయింది.

స్థానిక టీడీపీ నేతలు నిన్ననే అక్కడికి వెళ్లి బాధితులతో మాట్లాడి ఏమి జరిగిందో తెలుసుకున్నారు. అయితే ఇళ్ళు కూల్చివేతపై చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జూమ్ యాప్ ద్వారా నేరుగా వారితోనే మాత్లాడనున్నారు. ఆ ఇరవైమందికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story