మహారాష్ట్రలో కరోనా.. గడిచిన 24 గంటల్లో..

మహారాష్ట్రలో కరోనా.. గడిచిన 24 గంటల్లో..

మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,638 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 204 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,11,987కు చేరుకుంది. మరణించిన వారి సంఖ్య 9 వేలు దాటింది. ఇక కోలుకుని ఇళ్లకు వెళ్లిన వారి సంఖ్య 1,15,262 మంది. ఒక్క ముంబై సిటీలోనే 85,724 మంది కరోనా బారిన పడ్డారు. మరణించిన వారు 4938మంది. 24 గంటల్లో ముంబై నగరంలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర జనాభా 11 కోట్లు ఉండగా ఇప్పటి వరకు 11 లక్షల టెస్టులు నిర్వహించి పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హోంక్వారంటైన్ లో 6,15,265 మంది ఉండగా, ప్రభుత్వ క్వారంటైన్ లో 46,355 మంది ప్రభుత్వ క్వారంటైన్ లో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story