హోం క్వారంటైన్లోకి వెళ్లిన జార్ఖండ్ సీఎం
By - TV5 Telugu |8 July 2020 6:00 PM GMT
జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఇటీవల రాష్ట్ర తాగునీరు, పారిశుద్ద్య మంత్రి మితిలేవ్ ఠాగూర్.. సీఎంతో సమావేశం అయ్యారు. అయితే, తరువాత మంత్రి కరోనా పరీక్షలు చేపించుకోగా.. ఆయనకు పాజిటివ్ అని తేలడంతో.. సీఎం హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. సీఎంఓలోని సిబ్బందిని కూడా హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించారు. మంత్రితో పాటు.. ఇటీవల కరోనా సోకిన ఎమ్మెల్యే మధురా మహ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని సీఎం కోరుకున్నారు. ఇక సీఎం నుంచి కూడా నమూనాలు సేకరించి పరీక్షలు జరపనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com