ఆగ్రాలో ఘోరం : నిద్రిస్తున్న వారిపైనుంచి వెళ్లిన కంటైనర్

ఆగ్రాలో ఘోరం : నిద్రిస్తున్న వారిపైనుంచి వెళ్లిన కంటైనర్

ఆగ్రాలో ఘోరం జరిగింది. నిద్రిస్తున్న వారిపై కంటైనర్ వెళ్లడంతో ఐదుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన సికంద్ర పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గురుద్వార సమీపంలో జరిగింది. అక్కడ ఫుట్‌పాత్‌పై మొత్తం ఏడుగురు నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో అదుపుతప్పిన కంటైనర్ వారిమీది గుండా వెళ్ళింది.

దాంతో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వేంటనే అక్కడికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ డ్రైవర్ , క్లీనర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్షమే కారణమని అని పోలీసులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story