ఓ మహిళ నిర్లక్ష్యం.. 27 మందికి కరోనా

ఓ మహిళ నిర్లక్ష్యం.. 27 మందికి కరోనా

కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకోవలసిన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. పోలీసుల, వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కరోనాతో ప్రత్యక్ష పోరాటం చేస్తున్నారు. అయితే, ప్రజలు కరోనా కట్టడిలో భాగం కాకపోతే, ఈ మహమ్మారిని అడ్డుకోవడం కష్టం. చాలా ప్రాంతాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కరోనా వ్యాప్తికి అవకాశం ఇస్తున్నారు. తాజాగా ఓ మహిళ నిర్లక్ష్యానికి 27 మందికి కరోనా సోకింది. రాజస్థాన్ లో జోధ్‌పూర్‌లో ఓ వివాహానికి హాజరైన 27 మందికి కరోనా సోకిందని వైద్యులు నిర్థారించారు. కరోనా బారిన పడిన మహిళ ఈ వివాహానికి హాజరైందని.. దీంతో, ఆ వివాహానికి హాజరైన 27 మందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. ఆమెకు కరోనా పాజిటివ్ అనే విషయం ఎవరికీ తెలియజేయలేదని అన్నారు. ప్రభుత్వాలు, అధికారులు ఎంత శ్రమించినా.. ప్రజలు స్వీయ రక్షణ పాటించకపోతే కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యం కాదని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story