జూలై 16 వరకు లాక్డౌన్
By - TV5 Telugu |9 July 2020 3:32 PM GMT
దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఇక బిహార్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా పాట్నాలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో పాట్నాలో జులై 16వ తేదీ వరకు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్, కలెక్టర్ కుమార్ రవి తెలిపారు. అన్ని ప్రార్థనా స్థలాల్లో భక్తులకు అనుమతి లేదని తెలిపారు. అలాగే మతపరమైన కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిత్యావసర సేవలు, ఇతర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా, బిహార్లో 749 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,274కి చేరింది. కరోనా మహమ్మారి బారి నుండి 9,338 కోలుకున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com