కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేది..
ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ను అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) విడుదల చేసింది. దీని ప్రకారం టెక్నికల్ కోర్సుల్లో కొత్తగా చేరే విద్యార్ధులకు, రెండో ఏడాదిలో ప్రవేశించే వారికి అక్టోబర్ 15 నుంచి, మిగిలిన వారికి ఆగస్ట్ 17 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో అకడమిక్ క్యాలెండర్ ను సవరించాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ జూలై 6న కోరింది. దీంతో యూజీసీ నియమావళి ప్రకారం కొత్త అకడమిక్ క్యాలెండర్ ను రూపొందించామని ఏఐసీటీఈ పేర్కొంది. దీని ప్రకారం వివిధ కోర్పుల్లో అడ్మిషన్స్ కు
సంబంధించి అక్టోబర్ 5 లోపు మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని, అక్టోబర్ 15 నాటికి రెండో విడత కౌన్సిలింగ్ ను ముగించాలని అన్ని సాంకేతిక, వృత్తివిద్యా కళాశాలకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించి అక్టోబర్ 20 నాటికి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com