దేశంలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ జరగలేదు : కేంద్ర మంత్రి
By - TV5 Telugu |9 July 2020 4:27 PM GMT
దేశంలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ఇంకా జరగలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మరోసారి స్పష్టం చేశారు. కోవిడ్ -19 కేసుల్లో 90 శాతం ఎనిమిది రాష్ట్రాల్లో నమోదయ్యాయని ఆయన అన్నారు. వాటిలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయన్నారు. 75 శాతం కొత్త కేసులు కూడా ఈ రాష్ట్రాలనుండే వచ్చాయని అన్నారు. ఇక తాజాగా 24,879 పాజిటివ్ కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 7,67,296 కు చేరుకుందని అన్నారు. కొత్త కేసులలో 75 శాతం కేసులు నమోదయ్యాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com